యాప్నగరం

చింతమనేని కేసు.. మహిళా ఎస్సై క్రాంతి ప్రియపై వేటు

ఇంకా అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. గాలిస్తున్న పోలీసులు. ప్రభాకర్‌పై కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వరుసగా వేటు.

Samayam Telugu 7 Sep 2019, 7:59 pm
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. గతంలో ప్రభాకర్‌ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడగా.. తాజాగా పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియపై చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేస్తూ ఏలూరు డీఐజీ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu pabhakar


పెదవేగి ఎస్సైగా పని చేసిన క్రాంతిప్రియ.. పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసు నుంచి చింతమనేని పేరును తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును సక్రమంగా విచారణ చేయలేదని.. ఇప్పుడు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. క్రాంత్రి ప్రియ ప్రస్తుతం కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

పినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటూ మరికొందరు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అప్పటి నుంచి ప్రభాకర్‌ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చింతమనేని ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.. ఆయన కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించి మరీ వెతికే పనిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.