యాప్నగరం

అనంతపురం: ఇంట్లో నుంచి బయటకొస్తే స్ప్రే పనిష్మెంట్.. ఇదేదో బావుందే

అనంతపురం జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనల్ని పాటించనివారికి ఎస్సై వెరైటీ పనిష్మెంట్. అకారణంగా ఎవరైనా ఇళ్లలో నుంచి బయటకు వస్తే ఇదే శిక్ష. ఎస్సైను అభినందిస్తున్న స్థానికులు.

Samayam Telugu 2 Apr 2020, 10:37 am
దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ తప్పదు. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు.. జనాల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రజలు రోడ్లపైకి రావొద్దని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నా.. కొందరు ఆకతాయిలు మాత్రం ఆ నిబంధనల్ని పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు రావొద్దని చెబుతున్నా మాట వినడం లేదు. అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు.
Samayam Telugu ats


కొన్నిచోట్ల అకారణంగా పోలీసులు అమాయకుల్ని కొడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఒకటి రెండు ఘటనల్లో అలా జరిగి ఉండొ చ్చు.. కానీ పోలీసుల కష్టాలను కూడా అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందనే వాదన వినిపిస్తోంది. దీంతో పోలీసులు రూట్ మార్చారు.. ప్రజలకు అవగాహన కల్పిస్తూనే చిన్న, చిన్న పనిష్మెంట్లు ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ ఓ ఎస్సై వినూత్నంగా ఆలోచించారు.

గుడిబండలో ఎస్సై మస్తాన్‌ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారికి వినూత్నమైన పనిష్మెంట్ ఇస్తున్నారు. ఓ స్ప్రేయర్‌ను కొనుగోలు చేసి ఎవరైనా బయట తిరిగితే.. వారిపై శానిటైజర్‌ను స్ప్రే చేయించారు. కరోనా వ్యాప్తి చెందుతుందని.. జనాలను బయటకు రావొద్దని చెబుతున్నా వినకపోవడంతో.. ఇలా శానిటైజర్ స్ప్రే చేయిస్తున్నాము అంటున్నారు పోలీసులు. ఈ వినూత్న ఆలోచనను స్థానికులు కూడా ప్రశంసిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.