యాప్నగరం

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిదిరి అప్పలరాజు.. మొదటి సంతకం ఆ ఫైల్ పైనే

మత్స్యకారుడైనా తనకు పశుసంవర్థక, మత్స్యశాఖ అప్పగించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానన్నారు సిదిరి అప్పలరాజు.

Samayam Telugu 26 Jul 2020, 12:59 pm
ఇటీవల ఏపీలో కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు సిదిరి అప్పలరాజు. తాజాగా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానన్నారు సిదిరి. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఆయన ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఆక్వా కల్చర్‌ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు.
Samayam Telugu సిదిరి అప్పలరాజు
sidhiri appalaraju

Read More: అది జగన్ పెట్టిన బిక్ష.. వైసీపీ ఎంపీపై మంత్రి అవంతి కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో.. ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు సిదిరి అప్పలరాజు.
మత్స్య కారుడిన తనకు ఈ శాఖ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. మత్స్యకారులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సిదిరి. ఆక్వారంగానికి కరెంటు యూనిట్ రూపాయున్నరకే ఇస్తున్నామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.