యాప్నగరం

Singapore Consortium: అమరావతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సింగపూర్

అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సింగపూర్. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో.. ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు తెలిపిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్.

Samayam Telugu 12 Nov 2019, 12:07 pm
ఏపీ రాజధాని అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ తప్పుకుంది. ఏపీ ప్రభుత్వం-సింగపూర్ కన్సార్టియం చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో.. ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల.. సింగపూర్ నుంచి వచ్చే పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి ఈశ్వరన్ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu ap capital


అమరావతి ప్రాజెక్టును రద్దు కావడంతో.. కొన్ని మిలియన్ డాలర్లు మాత్రమే ప్రభావం చూపుతుందని కన్సార్టియం కంపెనీలు భావిస్తున్నాయి. ఇండియాలో తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండవంటున్నాయి. ఏపీతో పాటూ మిగిలిన రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సింగపూర్ కంపెనీలు ఇకపై కూడా ఆసక్తి కనబరుస్తాయన్నారు సింగపూర్ మంత్రి ఈశ్వరన్. పెట్టుబడులు పెట్టేందుకు భారత్ మంచి అవకాశాలు ఉన్న మార్కెట్‌గా తాము అనుకుంటున్నామని ఈశ్వరన్ ప్రకటనలో తెలిపారు.

Read Also: 'అమరావతి భూములు రాజధానికి అనుకూలం కావు'

రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో రాజధాని అమరావతిలో 6.84 చ.కి.మీ అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తాజాగా జగన్ సర్కార్ స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సింగపూర్ మంత్రి ప్రకటన విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.