యాప్నగరం

తూ.గో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, వివాహానికి వెళ్లి వస్తుండగా!

ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని రాజమండ్రి, గోకవరం ఆస్పత్రులకు తరలించారు.. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.

Samayam Telugu 30 Oct 2020, 6:34 am
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్ని రాజమండ్రి, గోకవరం ఆస్పత్రులకు తరలించారు.. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
Samayam Telugu తూర్పుగోదావరి జిల్లా


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులు మృతులు గోకవరం మండలం ఠాకుర్‌పాలెంకు చెందిన వారిగా గుర్తించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.