యాప్నగరం

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డు వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు గాయపడ్డారు. భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 23 Apr 2023, 7:48 pm
తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు 33వ మలుపు వద్ద ఆరుగురితో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఘాట్‌రోడ్డు పక్కన లోతు తక్కువగా ఉండటంతో వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఘాట్‌ రోడ్డు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.
Samayam Telugu తిరుమలలో కారు ప్రమాదం



వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను కారు నుంచి బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో భక్తులకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


సరిగ్గా వారం రోజుల క్రితం కూడా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఇలాంటి ప్రమాదమే జరిగింది. 24వ మలుపు వద్ద కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు నడుపుతున్న వ్యక్తి కంగారులో ఎక్సలేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.