యాప్నగరం

ప.గో జిల్లాలో విషాదం.. వాగులో గల్లంతైన వారిలో నలుగురు మృతి

సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Samayam Telugu 28 Oct 2020, 1:31 pm
పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది.. ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. బుధవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీశారు.. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మరో ఇద్దరు డెడ్‌బాడీలు తీశారు. మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.