యాప్నగరం

Agri Gold: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ

Agri Gold: అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై.. సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ రాశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్న సోము వీర్రాజు.. మూడున్నరేళ్ల దాటినా ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 8 Mar 2023, 5:36 pm

ప్రధానాంశాలు:

  • సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ
  • అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై లేఖ
  • శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Somu Veerraju
సోము వీర్రాజు
Agri Gold: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు లేఖ రాశారు. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం ఏమైందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను కోర్టు పరిధి నుంచి దాటి పరిష్కరిస్తానని.. ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా.. ఎందుకు పరిష్కరించలేదని Somu Veerraju ప్రశ్నించారు.
'అగ్రి గోల్డ్ సంస్ధ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లించకపోవడంతో 142 మంది మృతి చెందారు. ఆనాడు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి మూడు లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తానంటే.. ఆనాడు మీరు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా. రూ.10 వేలులోపు పరిధి ఉన్న బాండ్లుకు 2019 సంవత్సరంలో రూ.250 కోట్లు, 2021 ఆగస్టులో రూ. 667 కోట్లు మేరకు మాత్రమే బాండ్లు పరిష్కారం జరిగింది. ఆ తర్వాత ఒక్కరికి కూడా పరిష్కారం కాలేదు' అని సోము వీర్రాజు లేఖలో ప్రస్తావించారు.

'అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 14 లక్షల మంది.. తమ బాండ్లకు ఎప్పుడు నగదు పరిష్కారం జరుగుతుంది అని ఎదురుచూస్తున్నారు. విచిత్రమేమంటే అగ్రిగోల్డ్ సంస్ధ నడుపుతున్న ఇతర సంస్ధలు యధావిధిగా నడుస్తున్నాయి. వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదు. అగ్రిగోల్డ్‌లో నగదు మదుపు చేసి బాండ్లు తీసుకున్న వారి సమస్యలపై.. ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు' సోము వీర్రాజు నిలదీశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.