యాప్నగరం

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే!

వేసవి సెలవుల నేపథ్యంలో కాచిగూడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 8 May 2022, 10:13 am
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలని అనుకుంటున్న వారికి గుడ్‌ న్యూస్ చెప్పింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రైళ్ల వివరాలను ట్వీట్ చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజలు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కాచిగూడ నుంచి తిరుపతి.. తిరుపతి నుంచి కాచిగూడకు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది.
Samayam Telugu ప్రతీకాత్మకచిత్రం



మే 11న ప్రత్యేక రైలు (07297)ను కాచిగూడ – తిరుపతి మధ్య నడపనున్నారు. ఈ రైలు రాత్రి 10.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు 11.00 గంటలకు తిరుపతికి చేరుతుంది.

ఇక, మే 12న ప్రత్యేక రైలు (07298) తిరుపతి నుంచి కాచిగూడకు నడపనున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లు ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.