యాప్నగరం

నేను హర్టయ్యా.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

రెండో రోజు ఏపీ అసెంబ్లీలో విచిత్రమైన సన్నివేశం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం. టీడీపీ సభ్యుల తీరుపై అసహనంతో ఛైర్ నుంచి లేచి బయటకొచ్చిన తమ్మినేని.

Samayam Telugu 21 Jan 2020, 12:45 pm
ఏపీ అసెంబ్లీ రెండో రోజు ఆసక్తి పరిణామం జరిగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఎస్సీ కమిషన్ బిల్లును మంత్రి పినిపే విశ్వరూప్ ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ చర్చ ప్రారంభించగా.. సభ్యులు మాట్లాడారు. ఇదే సందర్భంలో టీడీపీ సభ్యులు రాజధాని వ్యవహారంపై నిరసన కొనసాగించారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు.. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
Samayam Telugu tammineni sitaram

టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి సీట్లు కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు.. అక్కడే నిరసన తెలియజేశారు. దీంతో తమ్మినేని తీవ్రంగా స్పందించారు. టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని.. తాను మనస్తాపంతో ఉన్నానని అసహనాన్ని వ్యక్తం చేశారు. హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి వెళ్లిపోయారు.

దీంతో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఎస్సీలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వారికి ఎస్సీలంటే గౌరవం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొద్దిసేపటికి సభ వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనల్ని కొనసాగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.