యాప్నగరం

ఆ మూడు న్యూస్‌ ఛానల్స్‌ నిషేధం.. స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఛానల్స్‌ను నిషేధించడంపై స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు. అసెంబ్లీ నిబంధనలు తెలిసినా నటిస్తే ఎలా.. నిద్రపోయే వారిని లేపొచ్చు కానీ.. నిద్రపోయినట్లు నటించే వాళ్లను ఏమీ చేయలేం.

Samayam Telugu 4 Aug 2019, 3:56 pm
అసెంబ్లీ నిబంధనల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. అసెంబ్లీ నియమావళికి విరుద్ధంగా ప్రసారాలు నిర్వహించినందుకే ఆ మూడు చానల్స్‌కు నోటీసులు జారీ చేశామని.. ఎవరైనా నిబంధనల్ని పాటించాల్సిందేనన్నారు. అసెంబ్లీ నిబంధనలు తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. నిద్రపోయేవారిని లేపొచ్చు కానీ.. నిద్రపోయినట్టు నటించే వాళ్లను ఏమి చేయలేమన్నారు. విజయవాడలో మాట్లాడిన తమ్మినేని సీతారాం.. మూడు ఛానల్స్‌కు నోటీసులు పంపడంపై స్పందించారు.
Samayam Telugu sitaram

Read Also: వెంకయ్య తప్పు చేశారు.. స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెల్స్‌ను శాసనసభ ఆవరణలోకి ప్రవేశం నిరాకరిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. వీరు బయటకు వచ్చి మీడియా పాయింట్‌లో మాట్లాడగా.. ఈ మూడు ఛానల్ వాటిని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే, సభ జరుగుతున్నప్పుడు ఇలా మీడియా పాయింట్ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేయడం రూల్స్‌కి వ్యతిరేకం.. అందుకే చర్యలు తీసుకున్నారు.

ఈ విషయాన్ని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పీకర్ తమ్మినేని దృష్టికి తీసుకెళ్లడంతో నోటీసులు జారీచేశారు. మీడియా పాయింట్ వద్ద ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి గల కారణంపై వివరణ ఇచ్చే వరకూ అసెంబ్లీలోకి అనుమతించబోమని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు స్పీకర్ తమ్మినేని సీతారాంను జర్నలిస్ట్‌ల సంఘాలు కలిసి, బహిష్కరణ విషయంలో పునరాలోచించాలని కోరాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.