యాప్నగరం

ఆ ఇద్దరు అవుట్, వెళ్లిపోతామని చెప్పారట.. పట్టుబట్టి తీసుకొస్తే, ఇదేం ట్విస్ట్!

రాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన గతంలో కేంద్ర సర్వీసులో పని చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనరుగా బాధ్యతలను నిర్వర్తించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సీఎంవోకి మారారు.

Samayam Telugu 16 Nov 2020, 8:20 am
ఏపీ సీఎంవోలో మార్పులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్ మళ్లీ కేంద్ర సర్వీసుకు వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు తనకు అవకాశం వచ్చిన విషయాన్ని ఆయన సీఎం జగన్‌‌కు వివరించగా.. సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆయన కేంద్ర సర్వీసులకు వెళతారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఉత్వర్వులు రావాల్సి ఉంది. ప్రవీణ్‌ ప్రకాష్ కేంద్ర సర్వీసులకు వెళితే ప్రస్తుతం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్‌.ఎస్‌.రావత్‌ సీఎంవోలోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.
Samayam Telugu సీఎం జగన్


Read Also: పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్: చాలా రోజుల తర్వాత.. ఈ నెల 17,18న

ప్రవీణ్‌ ప్రకాష్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన గతంలో కేంద్ర సర్వీసులో పని చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనరుగా బాధ్యతలను నిర్వర్తించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సీఎంవోకి మారారు. ఇప్పుడు మళ్లీ కేంద్ర సర్వీసులకు వెళతారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.

Also Read: ఏపీలో వాహనదారులకు అలర్ట్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇటు ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రమేష్ సలహాదారుగా కొన్ని కీలక శాఖల బాధ్యతల్ని చూశారు.. ఆ తర్వాత తొలగించారు. ఆ తర్వాత సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం వద్ద ఉన్న శాఖలను తీసేశారు. అయితే ఆ తర్వాత తీసేసిన శాఖలను కల్లంకు అప్పగించడం హాట్‌టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఉన్నట్టుండి రమేష్ రాజీనామాకు సిద్ధమయ్యారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.