యాప్నగరం

ఏపీలో ఘోర ప్రమాదం.. డిప్యూటీ తహసీల్దార్ దుర్మరణం, ఐదుగురికి గాయాలు

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 20 May 2022, 12:36 pm
శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ దుర్మరణం చెందగా.. తహసీల్దార్ వెంకటరావుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా.. అనకాపల్లి మండలం శంకరం ఏలేరు కాలువ వద్ద కారు బోల్తాకొట్టినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రమాదానికి గురైన కారు


ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దారు సతీష్ మృతి చెందారు. ఎమ్మార్వో వెంకటరావుకి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖపట్నం అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.