యాప్నగరం

థ్యాంక్యూ సీఎం సార్.. జగన్‌‌‌తో మత్స్యకారులు.. ఒక్కక్కొరికి రూ.5లక్షలు

పాక్ చెర నుంచి బయటపడిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో కలిసిన 20మంది థ్యాంక్యూ సీఎం సార్ అంటూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మత్స్యకారులను పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ జగన్ దగ్గరకు తీసుకెళ్లారు.

Samayam Telugu 8 Jan 2020, 2:58 pm
పాక్ చెర నుంచి బయటపడిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో కలిసిన 20మంది థ్యాంక్యూ సీఎం సార్ అంటూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మత్స్యకారులను పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ జగన్ దగ్గరకు తీసుకెళ్లారు.
Samayam Telugu srikakulam fishermen meet ap cm ys jagan after released from pak jail
థ్యాంక్యూ సీఎం సార్.. జగన్‌‌‌తో మత్స్యకారులు.. ఒక్కక్కొరికి రూ.5లక్షలు


పాక్ నుంచి తిరిగొస్తామనుకోలేదు..

పాక్ నుంచి బయటపడతామా లేదా అని భయపడ్డామని.. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో విడుదలయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి మత్స్యకారులు తమ సొంత ఊళ్లకు బయల్దేరనున్నారు. దాదాపు ఏడాది తర్వాత తమ కుటంబ సభ్యుల్ని కలవనున్నారు.. ఇటు వారి గ్రామాల్లో కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. వారికి ఘన స్వాగత పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

ఒక్కొక్కకరికి రూ.5లక్షలు సాయం!

ఇదిలా ఉంటే.. పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులకు మఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. సీఎం కృషి ఫలితంగానే 20 మంది పేద మత్స్యకారులు తిరిగి రాగలిగారని.. పాక్‌ జైల్లో ఉన్న మరో ఇద్దరి పత్రాల పరిశీలనలో ఆలస్యం కావడంతో విడుదల కాలేదని.. వీరు కూడా పది రోజుల్లో విడుదలవుతారని చెప్పారు.

2018లో పాక్ చెరలోకి ఉత్తరాంధ్ర మత్స్యకారులు

2018 నవంబర్‌లో మత్స్యకారులు గుజరాత్‌ సమీపంలోని అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. పొరపాటున సరిహద్దు దాటి పాక్‌ కోస్ట్‌గార్డులకు మొత్తం 22 మంది బందీలుగా చిక్కారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. వారిని విడుదల చేయాలని టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు.. వెంటనే రంగంలోకి దిగి పాక్‌తో చర్చలు జరపగా.. 20మందిని పాక్ విడుదల చేసింది.

వాఘా సరిహద్దుకు వెళ్లిన మంత్రి మోపిదేవి

ఈ 20మందిని తీసుకొచ్చేందుకు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పంజాబ్ సరిహద్దుకు వెళ్లారు. అక్కడ మత్స్యకారులకు స్వాగతం పలికి.. ఢిల్లీకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి బయల్దేరి హైదరాబాద్ వచ్చి.. తర్వాత అమరావతి చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక పాక్ చెరలో ఉన్న.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మిగిలిన ఇద్దర్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.