యాప్నగరం

సిక్కోలు జవాన్ వీర మరణం.. 9 నెలల క్రితం పెళ్లి, ఇంతలో విషాదం

బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి, 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు.

Samayam Telugu 23 Oct 2020, 7:51 am
శ్రీకాకుళం జిల్లాకు వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను బొంగు బాబూరావు వీరమరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాను భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా ర్యాలీతో స్వగ్రామానికి తీసుకొచ్చారు.
Samayam Telugu వీర జవాన్ బాబూరావు


బాబూరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి, 21 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు. పెళ్లైన తొమ్మిది నెలలకే భర్త ఇలా చనిపోవడంతో భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం అభిమానులు, స్థానికుల అశ్రునయనాల నడుమ సైనిక లాంఛనాలతో బాబూరావు అంత్యక్రియలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.