యాప్నగరం

శ్రీకాకుళం: చర్చి వివాదంలో ఘర్షణ.. ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో మహిళ

శ్రీకాకుళంలో చర్చి విషయంలో వివాదం చలరేగడంతో ఒకరు మరణించగా, మరొకరు గాయాలపాలయ్యారు.

Samayam Telugu 18 Oct 2020, 11:15 pm
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వీరఘట్టంలోని బాప్టిస్ట్ చర్చి వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కళింగ పోలిరాజు (43) మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ మహిళను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, మరణించిన కళింగ పోలిరాజు మృతదేహంతో పోలీస్ స్టేషన్‌ ఎదుట బంధువులు ధర్నాకు దిగారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
gang war


వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం వీరఘట్టంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇరు వర్గీయులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఇరు వర్గీయులను హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.