యాప్నగరం

శ్రీకాకుళం: సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు

శ్రీకాకుళం సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

Samayam Telugu 18 Oct 2020, 11:56 pm
ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో వాహనాలు, జనాలు సైతం కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం రట్టి సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఆరుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారు కమలాపురానికి చెందిన జాయి శ్రీకాంత్ (18), సిరియాపల్లికి చెందిన సిసింద్రీ (18)గా స్థానికులు, అధికారులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది తీరంలో వెతుకుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.