యాప్నగరం

శ్రీకాళహస్తి పోలీసుల సంచలన నిర్ణయం.. ఇళ్ల నుంచి బయటికొచ్చారో..

శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇళ్ల నుంచి ఎవరైనా బయటకు వస్తే క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరించారు.

Samayam Telugu 28 Apr 2020, 1:47 pm
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళహస్తిలో 24 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. ఈ అంక్షలను అమలులోకి తీసుకొచ్చి మంగళవారానికి ఐదో రోజు అయింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
Samayam Telugu శ్రీకాళహస్తిలో మాక్ డ్రిల్


ఇందులో భాగంగా ప్రజలను చైతన్య పరచడానికి బయటకొచ్చిన కొంత మంది యువకులను అంబులెన్స్‌లో క్వారంటైన్‌కు తరలించేలా డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నామని చెప్పారు. దీని ఉద్దేశం ప్రజలను చైతన్య పరచడానికే తప్ప భయాందోళనకు గురిచేయడానికి కాదని పోలీసులు తెలిపారు.

వలంటీర్ల ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సరుకుల పంపిణీ జరుగుతోందని పోలీసులు తెలిపారు. అయితే కొంత మంది బయటకు వస్తూనే ఉన్నారని అలాంటి వారిని జాగ్రత్తలు చెప్పడానికే డెమో నిర్వహించినట్లు చెప్పారు. అయితే ఇకపై ఎవరైనా బయటకు వస్తే క్వారంటైన్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి బయటకొచ్చిన వారిపై 150 కేసులు నమోదు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసినట్లు సీఐ నాగార్జున్‌రెడ్డి తెలిపారు. కాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి నిర్వహించిన ర్యాలీ వల్ల పట్టణంలో కరోనావైరస్ కేసులు పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.