యాప్నగరం

గరుడ వాహనంపై విహరించిన వేంకటేశుడు

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు భారీగా భక్తులు తరలివస్తారు.

Samayam Telugu 4 Oct 2019, 11:24 pm
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం గరుడ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో విహరించారు. అశేష భక్త జనసందోహం నడుమ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. మలయప్ప స్వామివారికి గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు.
Samayam Telugu ttd


Also Read: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

గరుడ సేవ సందర్భంగా నాలుగు మాఢవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగింది. భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ గరుడ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు శ‌నివారం హ‌నుమంత వాహ‌నం, స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రికి గ‌జ‌వాహనంపై శ్రీవారు విహరించనున్నారు.

Read Also: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడ వాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ విశిష్టత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌కు భారీగా భక్తులు తరలివస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.