యాప్నగరం

కర్నూలు: ఎస్సార్బీసీ డీఈ మృతి.. ప్రమోషన్ వచ్చిన కొద్దిరోజులకే విషాదం

భానుప్రకాష్ భానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్ల తనిఖీ సమయంలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. గేట్ల పైభాగంలోని యంత్రాలకు మరమ్మతులు చేయిస్తుండగా.. భారీ శబ్దాలు వచ్చాయి.. ఇంతలోనే!

Samayam Telugu 23 Sep 2020, 7:50 am
కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎస్సార్బీసీ డీఈ తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం డీఈ భానుప్రకాష్ భానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్ల తనిఖీ సమయంలో తనిఖీ చేసేందుకు వెళ్లారు. గేట్ల పైభాగంలోని యంత్రాలకు మరమ్మతులు చేయిస్తుండగా.. భారీ శబ్దాలు వచ్చాయి. ఆ పక్కనే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా పైకి లేచాయి. వాటిని చూసి షాకైన భానుప్రకాష్.. తప్పించుకునే ప్రయత్నంలో కిందపడిపోయారు.
Samayam Telugu కర్నూలు జిల్లాలో విషాదం


డీఈ ముక్కులోంచి రక్తం వచ్చింది. వెంటనే అక్కడ సిబ్బంది కారులో ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారు.. ఆస్పత్రిలో డాక్టర్లు ఆయన చనిపోయినట్లు తేల్చారు. ఆయన కడప, నెల్లూరు, తిరుపతిలో ఏఈగా పని చేస్తూ ఇటీవలే డీఈ ప్రమోషన్‌పై వచ్చారు.. పాపం పదోన్నతి సంతోషిస్తున్న సమయంలోనే చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో మృతుని కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.