యాప్నగరం

శివాలయం వద్ద భూమి నుంచి శబ్దాలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ముక్త్యాలలోని శివాలయంలో భూమి నుంచి శబ్దాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి పలువురు అక్కడికి వస్తున్నారు.

Samayam Telugu 23 Jun 2020, 3:49 pm
కృష్ణా జిల్లా ముక్త్యాలలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కోటిలింగ క్షేత్రం వద్ద భూమి నుంచి శబ్దాలు వస్తున్నాయి. స్థానికులు తొలుత వీటిని భూ ప్రకంపనలుగా భావించి ఆందోళనకు గురయ్యారు. అనంతరం కోటిలింగ క్షేత్రం వద్ద భూమి నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తించారు. భూమి నుంచి శబ్దాలు వస్తున్నట్లు తెలుసుకొని పలువురు అక్కడికి తరలివచ్చారు. జగ్గయ్యపేటకు సమీపంలో ఈ ముక్త్యాల ఆలయం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu నమూనా చిత్రం
strange sounds from earth


Also Read: వణికిస్తున్న భూప్రకంపనలు.. ముప్పు పొంచి ఉందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.