యాప్నగరం

నెల్లూరులో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్.. నిబంధనలు ఇలా

ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటల తరువాత షాపులు మూసివేయాలనికలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామపంచాయితీల్లో లాక్ డౌన్ అమలు జరుగుతుంది.

Samayam Telugu 24 Jul 2020, 7:07 am
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. గురువారం ఏకంగా 7998 కేసులు వచ్చాయి. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.. అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. జిల్లాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. లాక్‌డౌన్, కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాలో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. నిబంధనల్ని అమల్లోకి తెచ్చారు.. జనాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Samayam Telugu నెల్లూరు లాక్‌డౌన్


తాజాగా నెల్లూరులో నేటి నుంచి లాక్ డౌన్ తరహాలో ఆంక్షలు విధిస్తున్నారు. శుక్రవారం నుంచి వారం రోజులపాటు లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. జులై 24 నుంచి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటల తరువాత షాపులు మూసివేయాలనికలెక్టర్ ఆదేశించారు. కానీ మెడికల్ షాపులు, పాల బూత్‌లకు మాత్రం సాయంత్రం వరకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామపంచాయితీల్లో లాక్ డౌన్ అమలు జరుగుతుంది. ఈ వారం తర్వాత పరిస్థితిని గమనించి ఆంక్షల కొనసాగింపుపై చర్చించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.