యాప్నగరం

జాబ్ క్యాలెండర్‌ జగడం.. జగన్ సర్కార్‌కి నిరసనల సెగ.. రెండేళ్లకే.!

కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి, విశాఖలో అవంతి, విజయనగరంలో బొత్స ఇళ్లను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 28 Jun 2021, 3:29 pm
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ కాక రేపుతోంది. ఉద్యోగ నియాకాలకు సంబంధించి జగన్ సర్కార్ విడుదల చేసిన క్యాలెండర్‌పై విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. జాబ్ క్యాలెండర్‌లో వాలంటీర్ పోస్టులను కూడా ఉద్యోగాలుగా చూపించారని.. అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ ఘాటుగానే విమర్శించింది. వైఎస్ జగన్ జాబుల పేరుతో నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని.. పలు విద్యార్థి సంఘాలు జాబ్ క్యాలెండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Samayam Telugu ఆందోళనకారుల అరెస్టులు
arrest


రాష్ట్రంలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం కొన్నింటిని మాత్రమే జాబ్ క్యాలెండర్‌లో చూపించారంటూ నిరసనల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి యత్నించారు. కడపలో అంజాద్‌ బాషా, తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఇళ్లను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి.

పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ జగన్ రెండేళ్ల పాలనలో ఇసుక దుమారం తర్వాత జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. అలాగే పలు కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడం కూడా యువతలో ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.