యాప్నగరం

మా స్కూల్ మాకే కావాలి.. ఈ విద్యార్థులది ఊహించని కష్టం!

Jarravaripalle School: మా స్కూల్ మాకే కావాలంటూ ఆందోళన నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా జర్రావారిపల్లె గ్రామానికి చెందితన విద్యార్థులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గంగవరం మండలంలోని ఈ పాఠశాలన నాడు - నేడు పథకం కింద అభివృద్ధి చేశారు. మంచి వసతులు కల్పించారు. ఇక్కడి పిల్లలు ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అలాంటి పాఠశాలకు వచ్చిన కష్టమేంటి? ఈ చిన్నారులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వివరాలు..

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 6 Jul 2022, 12:37 pm
మా స్కూల్ మాకే కావాలి అంటూ నినాదాలు చేస్తున్న ఈ విద్యార్థులది చిత్తూరు జిల్లా గంగవరం మండలం జర్రావారిపల్లె. ఈ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను కీలపట్లలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. గ్రామంలో పాఠశాల 40 సంవత్సరాల నుంచి ఉందని.. కాలనీలో మంచి ఇళ్లను కూడా వదులుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం, స్కూల్ అభివృద్ధి కోసం ఇక్కడే ఉంటున్నామని తల్లిదండ్రులు వాపోయారు.
Samayam Telugu జర్రావారిపల్లె విద్యార్థుల ఆందోళన
Jarravaripalle student protest in Chittoor


నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వరకు నిధులు తీసుకొచ్చి ఈ పాఠశాలను అభివృద్ధి చేశారని గ్రామస్థులు తెలిపారు. స్కూల్‌లో చక్కని వసతులు కల్పించారు. విద్యార్థులు చక్కగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే.. తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అలాంటి స్కూల్‌ను కాదని, వేరే స్కూల్‌కి తమ పిల్లల్ని పంపబోమని గ్రామస్థులు తేల్చి చెబుతున్నారు.

పక్కనే ఉన్న కీలపట్ల గ్రామానికి వెళ్లాంటే 3 కిలోమీటర్లు నడవాలి. మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. తరచూ ఏనుగులు, చిరుత పులులు తిరుగుతుంటాయని.. అలాంటి ప్రాంతం ద్వారా తమ పిల్లల్ని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కీలపట్ల స్కూలుకి పంపే పరిస్థితే వస్తే తమ పిల్లలను చదువు మానిపిస్తామే కానీ, అక్కడకి మాత్రం పంపించమని కరాఖండిగా చెప్తున్నారు.

తాము ఉదయం కూలి పనులకు వెళ్లి, సాయంత్రం తిరిగొస్తామని.. గ్రామంలోని పాఠశాలలోనే పిల్లలు ఉంటే తమకు ఎంతో ధైర్యంగా ఉంటుందని మరి కొంత మంది తల్లిదండ్రులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమపై దయ చూపి పిల్లల్ని కీలపట్ల పాఠశాలలో విలీనం చేయకుండా, తమ గ్రామంలోని పాఠశాలలోనే కొనసాగించాలని వారు కోరుతున్నారు.

Also Read:

రైల్వే ట్రాక్‌పై వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన సిగ్నల్స్‌మ్యాన్, హ్యాట్సాఫ్
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.