మా స్కూల్ మాకే కావాలి అంటూ నినాదాలు చేస్తున్న ఈ విద్యార్థులది చిత్తూరు జిల్లా గంగవరం మండలం జర్రావారిపల్లె. ఈ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను కీలపట్లలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. గ్రామంలో పాఠశాల 40 సంవత్సరాల నుంచి ఉందని.. కాలనీలో మంచి ఇళ్లను కూడా వదులుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం, స్కూల్ అభివృద్ధి కోసం ఇక్కడే ఉంటున్నామని తల్లిదండ్రులు వాపోయారు.
నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వరకు నిధులు తీసుకొచ్చి ఈ పాఠశాలను అభివృద్ధి చేశారని గ్రామస్థులు తెలిపారు. స్కూల్లో చక్కని వసతులు కల్పించారు. విద్యార్థులు చక్కగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే.. తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అలాంటి స్కూల్ను కాదని, వేరే స్కూల్కి తమ పిల్లల్ని పంపబోమని గ్రామస్థులు తేల్చి చెబుతున్నారు.
పక్కనే ఉన్న కీలపట్ల గ్రామానికి వెళ్లాంటే 3 కిలోమీటర్లు నడవాలి. మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. తరచూ ఏనుగులు, చిరుత పులులు తిరుగుతుంటాయని.. అలాంటి ప్రాంతం ద్వారా తమ పిల్లల్ని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కీలపట్ల స్కూలుకి పంపే పరిస్థితే వస్తే తమ పిల్లలను చదువు మానిపిస్తామే కానీ, అక్కడకి మాత్రం పంపించమని కరాఖండిగా చెప్తున్నారు.
తాము ఉదయం కూలి పనులకు వెళ్లి, సాయంత్రం తిరిగొస్తామని.. గ్రామంలోని పాఠశాలలోనే పిల్లలు ఉంటే తమకు ఎంతో ధైర్యంగా ఉంటుందని మరి కొంత మంది తల్లిదండ్రులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమపై దయ చూపి పిల్లల్ని కీలపట్ల పాఠశాలలో విలీనం చేయకుండా, తమ గ్రామంలోని పాఠశాలలోనే కొనసాగించాలని వారు కోరుతున్నారు.
Also Read:
రైల్వే ట్రాక్పై వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన సిగ్నల్స్మ్యాన్, హ్యాట్సాఫ్
నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వరకు నిధులు తీసుకొచ్చి ఈ పాఠశాలను అభివృద్ధి చేశారని గ్రామస్థులు తెలిపారు. స్కూల్లో చక్కని వసతులు కల్పించారు. విద్యార్థులు చక్కగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే.. తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అలాంటి స్కూల్ను కాదని, వేరే స్కూల్కి తమ పిల్లల్ని పంపబోమని గ్రామస్థులు తేల్చి చెబుతున్నారు.
పక్కనే ఉన్న కీలపట్ల గ్రామానికి వెళ్లాంటే 3 కిలోమీటర్లు నడవాలి. మధ్యలో అటవీ ప్రాంతం ఉంది. తరచూ ఏనుగులు, చిరుత పులులు తిరుగుతుంటాయని.. అలాంటి ప్రాంతం ద్వారా తమ పిల్లల్ని ఎలా పంపించాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కీలపట్ల స్కూలుకి పంపే పరిస్థితే వస్తే తమ పిల్లలను చదువు మానిపిస్తామే కానీ, అక్కడకి మాత్రం పంపించమని కరాఖండిగా చెప్తున్నారు.
తాము ఉదయం కూలి పనులకు వెళ్లి, సాయంత్రం తిరిగొస్తామని.. గ్రామంలోని పాఠశాలలోనే పిల్లలు ఉంటే తమకు ఎంతో ధైర్యంగా ఉంటుందని మరి కొంత మంది తల్లిదండ్రులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమపై దయ చూపి పిల్లల్ని కీలపట్ల పాఠశాలలో విలీనం చేయకుండా, తమ గ్రామంలోని పాఠశాలలోనే కొనసాగించాలని వారు కోరుతున్నారు.
Also Read:
రైల్వే ట్రాక్పై వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన సిగ్నల్స్మ్యాన్, హ్యాట్సాఫ్