యాప్నగరం

ఏపీలో ఒక్క కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు.. ఫోన్ నంబర్లు ఇవే..

Coronavirus in Vijayawada: విజయవాడలో ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు సరఫరా చేయనున్నట్లు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.

Samayam Telugu 26 Mar 2020, 11:18 pm
దేశం మొత్తం లాక్ డౌన్ అయిన నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విజయవాడ నగర కమిషనర్ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు వచ్చే విధంగా నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చర్యలు చేపట్టారు. ప్రజలు వారి ఇంటి నుంచే ఫోన్ ద్వారా తమకు అవసరమైన నిత్యావసర వస్తువులు చెబితే.. ఇంటి వద్దకే సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.
Samayam Telugu door delivery grocerry


సరుకుల హోం డెలివరీ చేసేలా సహకరించాలని విజయవాడ పరిధిలోని సూపర్ మార్కెట్ యజమానులతో నగర కమిషనర్ చర్చించారు. దీనికి వారు ఒప్పుకున్నారు.
మార్కెట్ల ఫోన్ నంబర్లు ఇవే..
పైన పేర్కొన్న నంబర్లకు ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఎంఆర్‌పీ ధరలకే ఇంటి వద్దకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఇంటి నుంచి బయటకు రాకుండా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ సహకరించాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఎంఆర్‌పీ ధరలకు మంచి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదే విధానాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు పట్టణాల్లో డోర్ డెలివరీ విధానాన్ని శ్రీకాకుళం వంటి కొన్ని పట్టణాల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.