యాప్నగరం

Tirumala: శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Samayam Telugu 11 Jun 2021, 2:45 pm
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకస్వాములు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయన వెంట తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ నిశ్చిత, శివకుమార్, డీపీ అనంత , పార్థసారధి రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఉన్నారు.
Samayam Telugu స్వామి వారి దర్శనానంతరం బయటికి వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ
nv ramana


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.