యాప్నగరం

ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఒకరు.. హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు

Supreme Court Collegium: ఏపీ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టులో ఒక జడ్జి నియామకానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Samayam Telugu 20 Apr 2020, 11:45 pm
రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బి.కృష్ణమోహన్‌, కె.సురేశ్‌రెడ్డి, కె. లలితకుమారి పేర్లను.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని సిఫార్సు చేసింది. సోమవారం సమావేశమైన సుప్రీం కోర్టు కొలీజియం ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించి చర్చించింది. అనంతరం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. సుప్రీం కొలీజియం ప్రతిపాదనల ఆధారంగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.
Samayam Telugu supreme-court-1462412739


కాగా, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలు చర్చించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ఈ ఐదుగురితో కూడిన వ్యవస్థనే కొలీజియం వ్యవస్థగా పరిగణించారు.

న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించడానికి వీల్లేదు. చీఫ్ జస్టిస్ తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలోని ఇతర నలుగురు న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.