యాప్నగరం

టీడీపీకి సుప్రీంకోర్టు షాక్.. మూడు వారాలు డెడ్‌లైన్

వైసీపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ నారిమన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు.

Samayam Telugu 27 Oct 2020, 12:51 pm
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూ కేటాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ నారిమన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి జరిపిన భూ కేటాయింపులను రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఆర్కే తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాల తర్వాత చేపట్టనుంది.
Samayam Telugu సుప్రీంకోర్టు


గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఆత్మకూరు పరిధిలోని సర్వే నంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ గత ప్రభుత్వం 2017లో జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అది నిబంధనలకు విరుద్ధమని ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పర్యావరణ చట్టాల ప్రకారం.. వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను నిర్మాణాలకు కేటాయించడం చట్ట విరుద్ధమని ఆళ్ల పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆళ్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కానీ కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.