యాప్నగరం

పోలవరం రివర్స్ టెండర్లు చెల్లనట్టేనా.! అసలు ఆ జీవో ఏం చెబుతోంది?

ఎవరూ రాని కారణంగా ఒక్కరికే కట్టబెడతారా? లేక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 ప్రకారం ఈ టెండర్లు చెల్లవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Samayam Telugu 23 Sep 2019, 7:17 pm
వైఎస్ జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిర్వహించిన రివర్స్ టెండర్లతో కొత్త అనుమానాలు రేగుతున్నాయి. హెడ్‌వర్క్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఒకే ప్యాకేజీగా నిర్ణయించి రూ.4,987 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎల్ 1 గా కంపెనీ కోట్ చేసిన ధరనే అంచనా వ్యయంగా నిర్ధారించి టెండర్లు ఆహ్వానించింది.
Samayam Telugu polavaram2


Must Read:
జగన్ సర్కార్ ‘రివర్స్ రికార్డ్‌’.. ఈ సారి ఎంత మిగిలిందంటే..!

టెండర్లలో 12.6 శాతం తక్కువకు అంటే రూ.4,358 కోట్లకు ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ మెఘా టెండర్ దాఖలు చేసింది. దీంతో ప్రభుత్వానికి సుమారు రూ.628 కోట్లు ఆదా అయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తరువాతే పెద్ద చిక్కు వచ్చి పడింది. తొలుత మొత్తం 8 సంస్థలు కాంట్రాక్ట్‌పై ఆసక్తి చూపినప్పటికీ చివరికి మెఘా సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. మిగిలిన 7 సంస్థలు తప్పుకున్నాయి. ఇప్పుడిదే ప్రభుత్వానికి సమస్యగా మారింది.

Also Read: జనాలు వాటితో కొట్టేందుకు రెడీగా ఉన్నారు.. జగన్‌పై బుద్దా ఘాటు విమర్శలు

రివర్స్ టెండరింగ్‌ విధానం ప్రకారం కనీసం రెండు సంస్థలైనా బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ప్రభుత్వమే స్వయంగా విధించిన నిబంధన. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 అదే స్పష్టం చేస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలని అందులో ఉంది. దాని ప్రకారం ఒక్కటే బిడ్ దాఖలైంది కాబట్టి టెండర్ ఖరారు చేసేందుకు వీలుపడదని జలవనరుల నిపుణుల వాదన.

Read Also: తాటిచెట్టు ఎక్కి దూడకి గడ్డి కోశారట.. లోకేష్ ఫైర్

ఎవరూ రాని కారణంగా ఒక్కరికే కట్టబెడతారా? లేక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలంటే కనీసం రెండు సంస్థలైనా బిడ్‌లు దాఖలు చేసి ఉండాలి. అలాగైతేనే ఒక సంస్థ ఎల్‌-1గా నిలిస్తే.. మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ నిబంధనలైతే సవరణలకు అవకాశం ఉండేది. ఇదే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విధానం కావడంతో సదరు నిబంధనలను పాటిస్తారో.. లైట్ తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.