పోసాని వర్సెస్ పృథ్వీ.. వైఎస్సార్సీపీలో రాజకీయం వేడెక్కింది. అమరావతిలో నిరసనలు చేస్తుంది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పోసాని మండిపడ్డారు. రాజధాని కోసం భూముల్ని త్యాగాలు చేసిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై మండిపడ్డారు.. వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోసాని వ్యాఖ్యలకు మళ్లీ పృథ్వీ కౌంటర్ ఇచ్చారు.
పెయిడ్ ఆర్టిస్టులు వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు పృథ్వీ. తనకు ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రైతులంటే తనకు గౌరవం ఉందని.. వారిని తాను అవమానపరచలేదన్నారు. కొంతమంది బినామీలు, పెయిడ్ ఆర్టిస్టుల్ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న వారిలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని మరోసారి ఉద్ఘాటించారు.
అమరావతిలో రైతుల భూముల్ని తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు మాట్లాడలేదని పృథ్వీ ప్రశ్నించారు. ఆయనకు అమరావతిలో బినామీ రైతులు కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తన తీరు వల్ల పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
పెయిడ్ ఆర్టిస్టులు వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు పృథ్వీ. తనకు ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రైతులంటే తనకు గౌరవం ఉందని.. వారిని తాను అవమానపరచలేదన్నారు. కొంతమంది బినామీలు, పెయిడ్ ఆర్టిస్టుల్ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న వారిలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని మరోసారి ఉద్ఘాటించారు.
అమరావతిలో రైతుల భూముల్ని తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు మాట్లాడలేదని పృథ్వీ ప్రశ్నించారు. ఆయనకు అమరావతిలో బినామీ రైతులు కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తన తీరు వల్ల పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.