యాప్నగరం

YSRCPలో రగడ: సారీ చెప్పే ప్రసక్తే లేదు.. పోసానికి పృథ్వీ కౌంటర్

క్షమాపణలు చెప్పే సమస్యే లేదంటున్న ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ. తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న పృథ్వీ. చర్చకు రావాలని పోసానికి సవాల్ విసిరిన ఎస్వీబీసీ ఛైర్మన్

Samayam Telugu 11 Jan 2020, 9:12 am
పోసాని వర్సెస్ పృథ్వీ.. వైఎస్సార్‌సీపీలో రాజకీయం వేడెక్కింది. అమరావతిలో నిరసనలు చేస్తుంది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు పోసాని మండిపడ్డారు. రాజధాని కోసం భూముల్ని త్యాగాలు చేసిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై మండిపడ్డారు.. వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోసాని వ్యాఖ్యలకు మళ్లీ పృథ్వీ కౌంటర్ ఇచ్చారు.
Samayam Telugu prudhvi.


పెయిడ్ ఆర్టిస్టులు వ్యాఖ్యలపై రైతులకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు పృథ్వీ. తనకు ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రైతులంటే తనకు గౌరవం ఉందని.. వారిని తాను అవమానపరచలేదన్నారు. కొంతమంది బినామీలు, పెయిడ్ ఆర్టిస్టుల్ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న వారిలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని మరోసారి ఉద్ఘాటించారు.

అమరావతిలో రైతుల భూముల్ని తీసుకున్నప్పుడు పోసాని ఎందుకు మాట్లాడలేదని పృథ్వీ ప్రశ్నించారు. ఆయనకు అమరావతిలో బినామీ రైతులు కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అమరావతి ఆందోళనలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తన తీరు వల్ల పార్టీ నష్టపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.