యాప్నగరం

తాడికొండలో కళ్లు పీకేసే బ్యాచ్: పసిపిల్లలే టార్గెట్.. వదంతులపై ఎస్ఐ క్లారిటీ

తాడికొండ మండలంలో కనుగుడ్లు పీకేసే బ్యాచ్ హల్‌చల్ చేస్తున్నారని వచ్చిన వార్తలపై ఎస్ఐ రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.

Samayam Telugu 25 Nov 2020, 11:54 pm
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పిల్లల కనుగుడ్లు పీకేసే బ్యాచ్ వచ్చారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో తాడికొండ ఎస్ఐ రాజశేఖర్ ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి వేళల్లో కొందరు అపరిచిత వ్యక్తులు వచ్చి కను గుడ్లు పీకేస్తున్నారని, పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని కొంత మంది వాట్సాప్‌లో, ఫేస్ బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ఇవన్నీ, వదంతులు, అపోహలు మాత్రమేనని, వీటిని ఎవరూ నమ్మవద్దని ఎస్ఐ రాజశేఖర్ సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానంగా సంచరించినట్లు అనిపిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని లేదా 100కు డయల్ చేసి తెలియజేయాలని తాడికొండ ఎస్ఐ రాజశేఖర్ సూచించారు.

ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానంతో ఎవరిపైనా అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఎస్ఐ రాజశేఖర్ ప్రజలను ఎస్ఐ రాజశేఖర్ కోరారు. ఎవరిపై అయినా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.