తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (Jc Prabhakar Reddy), ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి (Jc Asmith Reddy) పై మరో కేసు నమోదయ్యింది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గండికోట హాజీబాషాపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డి, అనుచరులు ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్, ఖాదర్బాషాతో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్ జేసీ అస్మిత్రెడ్డి ఈ నెల 23న మూడో వార్డులో పర్యటనకు వెళ్లారు. స్థానికంగా ఉన్న బీడీ ఫ్యాక్టరీ వద్దకు రాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆవెంటనే రాళ్ల దాడి కలకలంరేపింది. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Read LatestAndhra Pradesh News and Telugu News