యాప్నగరం

పవన్ కళ్యాణ్‌పై తమిళ పత్రికలో సంచలన కథనం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తమిళ పత్రికలో సంచలన కథనం ప్రచురితమైంది.

Samayam Telugu 28 Nov 2020, 8:23 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలు మరువక ముందే తమిళనాడు పత్రికలో ఆయనపై సంచలన కథనం ప్రచురించింది. తమిళ మీడియా పవన్ కళ్యాణ్‌ను ‘గందరగోళవాది’ అని ఒక కొత్త బిరుదు తగిలించింది. ‘‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదట భావించారు. కానీ, ఆ తర్వాత అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్‌లు పవన్‌తో భేటీ అయ్యాక.. జీహెచ్ఎంసీలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటికే నామినేషన్లు దాఖలు చేసి దాదాపు 50 మందిని వాటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.’’ అని తమిళ సాయంకాల దినపత్రిక మురుసు కథనంలో పేర్కొంది.

‘‘అలాగే 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌ కళ్యాణ్.. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చి పోటీకి దూరంగా ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే మాయావతి కూటమికి స్వస్తి పలికి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. ఇదంతా చూస్తుంటే పవన్‌ ‘గందరగోళ రాజకీయ నేత’గా కనిపిస్తున్నారని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు’’ అంటూ ఆ కథనంలో పేర్కొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై పలువురు విమర్శిస్తుండగా, తాజాగా తమిళ పత్రిక సెటైర్లు వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.