యాప్నగరం

రామతీర్థంలో హై టెన్షన్.. ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి, అద్దాలు ధ్వంసం

రామతీర్థం కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొండపైకి వైఎస్సార్‌సీపీ జెండాలతో వెళ్లడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.

Samayam Telugu 2 Jan 2021, 2:14 pm
విజయనగరం జిల్లా రామతీర్థం ఉద్రిక్తంగా మారింది. అగ్ర నేతల పర్యటనలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతల్ని టీడీపీ, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కొండపైకి వైఎస్సార్‌సీపీ జెండాలతో వెళ్లడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.. ఈ క్రమంలో టీడీపీ,బీజేపీ-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విజయసాయిరెడ్డి కారుపై కొందరు దాడి చేశారు.. అద్దాలు ధ్వంసం చేశారు. చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. ఈ తోపులాటలో విజయనగరం బీజేపీ మహిళా నేత కిందపడిపోయారు.
Samayam Telugu రామతీర్థం టెన్షన్


ఇటు రామతీర్థానికి టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. గుడి మెట్లపై వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు.. చంద్రబాబును కొండపైకి వెళ్లనిచ్చేది లేదంటున్నారు. ఇటు బీజేపీ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగింది.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు. మరికాసేపట్లో చంద్రబాబు రామతీర్థం చేరుకోబోతున్నారు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుంటామనడంతో హైడ్రామా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.