యాప్నగరం

కంటి వెలుగు ప్రారంభం.. జగన్‌‌ సర్కార్‌కు కొత్త తలనొప్పి

Ysr Kanti Velugu Scheme| వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. పాత పథకానికే కొత్తగా పేరు మార్చారంటున్న బీజేపీ, టీడీపీలు.

Samayam Telugu 10 Oct 2019, 4:12 pm
వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్నిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా.. అనంతపురంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభమయ్యింది. మొత్తం ఆరు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే కంటి వెలుగు పథకంపై ప్రతిపక్షాలు జగన్‌ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి.
Samayam Telugu ys jagan.


Read Also: సీఎం జగన్‌తో మెగాస్టార్ భేటీ.. ఎప్పుడంటే!

కంటి వెలుగు పథకం గత టీడీపీ సర్కార్ హయాంలోనే అమలు చేశారని.. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ వైఎస్సార్‌ పేరు మార్చిందంటున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. గత ప్రభుత్వ హయాంలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు జరిగాయని.. కళ్ళజోళ్లు కూడా పంపిణీ చేశామన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఇప్పుడు అదే పథకానికి వైఎస్ పేరు తగిలించి.. కొత్త పథకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి ఇ-ఐకేంద్రంగా.. దాదాపు 222 కేంద్రాలలో 67లక్షల మంది లబ్ధి పొందారన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. సామాన్యుడికి, పేదవాడి కోసం చేసిన కార్యక్రమాన్ని కంటి వెలుగుగా ఆర్భాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం మీద ప్రేమతో, వాళ్ళ పథకాన్నే ప్రవేశపెట్టారని.. కంటివెలుగు పక్కరాష్ట్రం నుంచి కాపీ చేశారా అంటూ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే బీజేపీ వాదన మరోలా ఉంది. కంటి వెలుగు పథకం ఎప్పటి నుంచో అమలులో ఉందంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. దీనికి కేంద్రమే 60శాతం నిధులిస్తోందని.. రాష్ట్రమే ఈ పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తన తండ్రి పేరు పెట్టారని విమర్శించారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ భవనాలకు వైఎస్సార్‌సీపీ రంగులు వేయడం సరికాదన్నారు వీర్రాజు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.