యాప్నగరం

వైసీపీ మహిళా నేత టంగ్ స్లిప్.. జనసైనికులు, తెలుగు తమ్ముళ్ల ట్రోలింగ్స్

YSRCP| 'జగన్ ఏపీని అవినీతి రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు' అంటూ నోరు జారిన వైఎస్సార్‌సీపీ నేత కిల్లి కృపారాణి.

Samayam Telugu 14 Oct 2019, 5:11 pm
రాజకీయ నేతలు అప్పుడప్పుడూ నోరు జారడం మామూలే. ఏదో చెప్పబోయి తడబాటులో ఇంకేదో అవుతుంది. రాజకీయాల్లో సుధీర్ఘమైన అనుభం, ప్రసంగాలు దంచేసే నేతలు సైతం ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతుంటారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ మహిళా నేత కూడా తడబబడ్డారు. పొరపాటున నోరు జారారు. ఇక అవకాశం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆగుతారా.. వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. జనసైనికులు కూడా వీడియోను వైరల్ చేస్తున్నారు.
Samayam Telugu killi


Read Also: 'అది జగన్ మంచితనం వల్లేనని చంద్రబాబు మర్చిపోవద్దు'

జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించబోతున్నారు. ఈ క్రమంలో జగన్ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాలపై చంద్రబాబు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చేందుకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ప్రెస్‌మీట్ నిర్వహించారు. పొరపాటున ‘జగన్ ఏపీని అవినీతి రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు’అనేశారు. అవినీతి రహిత బదులు అవినీతి అనేశారు.

Also Read: జేసీ దివాకర్‌రెడ్డి కారులో చోరీ .. రూ.6లక్షలు మాయం

ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. తెలుగు తమ్ముళ్లతో పాటూ జనసైనికులు వీడియోను వైరల్ చేస్తూ.. పార్టీల అనుబంధ పేజీల్లో ఈ వీడియోను షేర్ చేశారు. కిల్లి కృపారాణిని ట్రోల్ చేస్తున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన నేత ఇలా నోరు జారడంపై నెటిజన్లు కూడా సెటైర్లు పేలుస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.