యాప్నగరం

విశాఖ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు.. చంద్రబాబు ప్రకటన

విశాఖ గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. టీడీపీ నేతలు 2 నిమిషాల పాటు నివాళులర్పించారు.

Samayam Telugu 27 May 2020, 4:53 pm
విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి తెలుగు దేశం పార్టీ నాయకులు నివాళులర్పించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున చంద్రబాబు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
Samayam Telugu చంద్రబాబు నాయుడు


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన గురించి తెలిసినప్పుడు చాలా బాధపడ్డానని, కానీ లాక్‌ డౌన్ వల్ల అక్కడకు వెళ్లలేకపోయానని పేర్కొన్నారు. గ్యాస్ లీక్‌ దుర్ఘటన జరగ్గానే విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరానని అన్నారు. తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రానందునే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చారు.

ఇప్పటి వరకు స్టైరీన్ గ్యాస్ తీవ్రతపై శాస్త్రీయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు అన్నారు. బాధితులకు అండగా నిలబడ్డ ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన రంగనాయకమ్మ, తదితరులపై కేసులు పెట్టడం అమానుషమని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.