యాప్నగరం

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై సంచలన ఆరోపణలు.. కమిటీ వేసిన టీడీపీ

అధికార వైసీపీ నాయకుల భూదందాలను నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.

Samayam Telugu 24 May 2020, 10:35 pm
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భూదందాలను నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, శ్రవణ్‌ కుమార్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది.
Samayam Telugu ఎంపీ నందిగం సురేష్


వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో భూములను ఆక్రమించారని టీడీపీ ఆరోపించింది. వాటిని పరిశీలించేందుకు కమిటీ సభ్యులు అమరావతి వెళ్లనున్నారని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ పోటిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, నందిగం సురేష్‌ది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు జగన్ బాపట్ల సీటు కేటాయించగా.. ఘన విజయం సాధించారు. రాజధాని ప్రాంతంలో కీలక నేతగా, జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారు. అమరావతి ప్రాంతమైనా మూడు రాజధానుల నిర్ణయానికి జైకొట్టారు. ఇటీవల సురేష్ రాజధాని పర్యటనకు వెళ్లగా.. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.