యాప్నగరం

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే మద్దాలి గిరికి టీడీపీ షాక్

దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మద్దాలి గిరి పార్టీ మారిన కొద్ది గంటల్లోనే కీలక నిర్ణయం. మద్దాలి జంప్ కొట్టడంతో నియోజకవర్ట బాధ్యతలు కీలక నేతకు అప్పగింత.

Samayam Telugu 31 Dec 2019, 9:06 am
టీడీపీకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన గిరిధర్.. వైఎస్సార్‌సీపీకి జై కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ నేతలపై విరుచుకుపడ్డారు. ఇంగ్లీష్ మీడియం, రాజధాని విషయంలో బాబు రెండు పడవలపై కాళ్లు పెట్టారని.. దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. మద్దాలి గిరి జగన్‌కు జైకొట్టారో లేదో.. టీడీపీ వేగంగా పావులు కదిపింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
Samayam Telugu maddali.


Read Also:
న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం.. చంద్రబాబు ట్వీట్

ఎమ్మెల్యే గిరికి షాకిస్తూ.. పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోవెలమూడి రవీంద్రను అధినేత చంద్రబాబు నియమించారు. నియోజకవర్గ బాధ్యతల్ని రవీంద్రకు అప్పగించారు. ఆయన గుంటూరు పశ్చిమం నుంచి గతంలోనే టికెట్ ఆశించారు. సామాజిక, స్థానిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని 2014, 2019లో టికెట్‌ దక్కలేదు. కానీ పార్టీ కోసం రవీంద్ర పనిచేశారు.. పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గిరి వైఎస్సార్‌సీపీవైపు అడుగులు వేయడంతో ఈయనకు అవకాశం దక్కింది.

కోవెలమూడి రవీంద్ర నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నుంచి కేడర్ బయటకు వెళ్లకుండా నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. చంద్రబాబు కూడా అదే దిశగా ఆలస్యం చేయకుండా నియోజకవర్గ ఇంఛార్జ్‌ను నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.