యాప్నగరం

న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం.. చంద్రబాబు ట్వీట్

న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం. పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు. బొకేలు, కేక్‌లు తీసుకు రావొద్దన్న టీడీపీ అధినేత. ఆ డబ్బును అమరావతి రైతుల కోసం..

Samayam Telugu 31 Dec 2019, 8:19 am
టీడీపీ న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఎవరూ బొకేలు, కేక్‌లు తీసుకురావొద్దని అధినేత కోరారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నారు.
Samayam Telugu babu


Read Also: మళ్లీ తరిమెయ్యరని గ్యారెంటీ ఏంటీ.. ఎంపీ టీజీ సంచలన వ్యాఖ్యలు

‘ఆంధ్రప్రదేశ్‌లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే ఖర్చులను పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు విరాళంగా ఇవ్వాలి. ఆరోజు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉందాం’అన్నారు చంద్రబాబు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించనున్నారు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో టీడీపీ అధినేత పర్యటిస్తారు. రైతులకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.