యాప్నగరం

వైసీపీకి మున్సిపాలిటీని దానమిస్తున్నాం.. మాజీ మంత్రి సంచలన ప్రకటన

స్థానిక ఎన్నికలకు సంబంధించి డోన్ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు.

Samayam Telugu 13 Mar 2020, 4:24 pm
స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా డోన్‌ నియోజవర్గానికి సంబంధించి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డోన్ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు చైర్మన్‌ పదవి సహా 32 వార్డులు దానం చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu pjimage (20)

టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని, అందుకే పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. పోలీసులు సైతం టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. తమ అభ్యర్థులు చిన్న పనులు చేసుకుంటున్న వారని, ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ పథకాలు అందవని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే డోన్ మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే తన తమ్ముడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేయడంపై కేఈ కృష్ణమూర్తి స్పందించారు. రాజీనామా విషయం కేఈ ప్రభాకర్ తనతో మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. వైసీపీలోకి వెళ్తే తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.