తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. అకాల వర్షాల కారణం దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకు నష్టం జరిగింది అన్నారు. రెండు రోజుల పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించానని.. రైతులతో మాట్లాడాను అన్నారు. అన్నదాతల బాధలు చూశానని.. తాను పర్యటన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన మొదలైంది అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఆదుకుంటామని ప్రకటనలు మాత్రం ఇచ్చారన్నారు. నిర్థిష్టంగా ఏం చేస్తాం అనేది చెప్పకుండా.. అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. అన్నదాతలు కష్టాల్లో ఉంటే సీఎం వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అన్నారు చంద్రబాబు. సీఎం రాలేదు.. మంత్రులు కదలలేదు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని.. ప్రీమియం చెల్లించలేదని విమర్శించారు. రైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి ఇన్స్యూరెన్స్ కల్పిస్తారని.. రబీకి ఈ ప్రభుత్వం కట్టలేదన్నారు. అంటే పరిహారం అంతా ఈ ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని.. 40 నుంచి 50 శాతం పంట ఇంకా పొలాల్లో ఉందన్నారు. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారని.. మిగిలిన పంట కల్లాల్లోనే ఉందన్నారు.
తాను వచ్చాను అని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులను పంపుతోందని.. జిల్లాలో రైతుల పరిస్థితి చూసి తన పర్యటన మరో రోజు పొడిగించుకున్నట్లు చెప్పారు. పొలంలో ఉన్న దెబ్బతిన్న పంటకు 40 శాతం పరిహారం ఇవ్వాలి, ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత పరిహారం వస్తుందో అంత పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి వ్యవస్థను చిన్నా భిన్నం చేసిందని.. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం తమకు కావాల్సిన మిల్లులకే పంపుతుందన్నారు. దగ్గరలో మిల్లులు ఉన్నా.. తమకు కావాల్సిన మిల్లులకే పంపి రైతుల్ని దోచుకుంటోందన్నారు.
పంట పొలంలో ఉంటేనే పరిహారం ఇస్తామంటున్నారు, ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదన్నారు. ధాన్యం అకాల వర్షాల భారిన పడేది కాదన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిహారం పెంచి జీవోలు ఇచ్చామని.. నాడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పరిహారం అందజేశామన్నారు. ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నారననారు. ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలని.. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
72 గంటల్లో ప్రభుత్వం ధాన్యం అంతా కొనాలి, ఇదే ప్రభుత్వానికి డెడ్లైన్ అన్నారు చంద్రబాబు. మళ్లీ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని.. అందుకే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. జగన్ పాలనలో వరి వేసుకున్న రైతులు ఉరివేసుకునే పరిస్థితి వచ్చింది, మూడు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరణ పూర్తి చెయ్యాలన్నారు. ధాన్యం కొనకపోతే 9 నుంచి ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మొమోరాండం ఇస్తామన్నారు. మా పంట మునిగింది.. పరిహారం ఇవ్వండి అనే స్లోగన్ తో పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అప్పటికీ స్పందిచకపోతే.. 13 నుంచి నిరసన దీక్ష చేపడతామని.. తాను కూడా నిరసనలో పాల్గొంటాను అన్నారు. రైతులు కూడా కదలి రావాలి.. చైతన్యంతో ముందుకు రావాలి.. పోరాడాలి.. లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించదన్నారు.
రైతులు తమ సమస్యలు.. ధాన్యం అమ్మకంలో పడుతున్న ఇబ్బందులపై వీడియోలు, ఫోటోలు తీయాలని.. ప్రభుత్వం బాధ్యత గుర్తుచేద్దామన్నారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ నేతలు సైతం ఈ ప్రభుత్వం చర్యలను తప్పుపడుతున్నారని.. ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం ఎందుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేయలేదని.. ఏసీ రూమ్లో ఉంటే సమస్యలు తెలుస్తాయా అన్నారు. క్షేత్ర స్థాయిలో ఉంటేనే సమస్యలు తెలుస్తాయన్నారు.. సీఎం ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదన్నారు. రైతుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే రైతులు నిలబడతారు, ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే అన్నారు.
తాను వచ్చాను అని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులను పంపుతోందని.. జిల్లాలో రైతుల పరిస్థితి చూసి తన పర్యటన మరో రోజు పొడిగించుకున్నట్లు చెప్పారు. పొలంలో ఉన్న దెబ్బతిన్న పంటకు 40 శాతం పరిహారం ఇవ్వాలి, ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత పరిహారం వస్తుందో అంత పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి వ్యవస్థను చిన్నా భిన్నం చేసిందని.. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం తమకు కావాల్సిన మిల్లులకే పంపుతుందన్నారు. దగ్గరలో మిల్లులు ఉన్నా.. తమకు కావాల్సిన మిల్లులకే పంపి రైతుల్ని దోచుకుంటోందన్నారు.
పంట పొలంలో ఉంటేనే పరిహారం ఇస్తామంటున్నారు, ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదన్నారు. ధాన్యం అకాల వర్షాల భారిన పడేది కాదన్నారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిహారం పెంచి జీవోలు ఇచ్చామని.. నాడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పరిహారం అందజేశామన్నారు. ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నారననారు. ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలని.. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
72 గంటల్లో ప్రభుత్వం ధాన్యం అంతా కొనాలి, ఇదే ప్రభుత్వానికి డెడ్లైన్ అన్నారు చంద్రబాబు. మళ్లీ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని.. అందుకే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. జగన్ పాలనలో వరి వేసుకున్న రైతులు ఉరివేసుకునే పరిస్థితి వచ్చింది, మూడు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరణ పూర్తి చెయ్యాలన్నారు. ధాన్యం కొనకపోతే 9 నుంచి ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మొమోరాండం ఇస్తామన్నారు. మా పంట మునిగింది.. పరిహారం ఇవ్వండి అనే స్లోగన్ తో పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అప్పటికీ స్పందిచకపోతే.. 13 నుంచి నిరసన దీక్ష చేపడతామని.. తాను కూడా నిరసనలో పాల్గొంటాను అన్నారు. రైతులు కూడా కదలి రావాలి.. చైతన్యంతో ముందుకు రావాలి.. పోరాడాలి.. లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించదన్నారు.
రైతులు తమ సమస్యలు.. ధాన్యం అమ్మకంలో పడుతున్న ఇబ్బందులపై వీడియోలు, ఫోటోలు తీయాలని.. ప్రభుత్వం బాధ్యత గుర్తుచేద్దామన్నారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ నేతలు సైతం ఈ ప్రభుత్వం చర్యలను తప్పుపడుతున్నారని.. ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం ఎందుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేయలేదని.. ఏసీ రూమ్లో ఉంటే సమస్యలు తెలుస్తాయా అన్నారు. క్షేత్ర స్థాయిలో ఉంటేనే సమస్యలు తెలుస్తాయన్నారు.. సీఎం ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదన్నారు. రైతుకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే రైతులు నిలబడతారు, ప్రభుత్వాలు చేయాల్సింది ఇదే అన్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News