యాప్నగరం

విజయవాడ: చంద్రబాబు దీక్ష ప్రారంభం

విజయవాడలోని అలంకార్ సెంరట్ ధర్నాచౌక్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష ప్రారంభం. ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు నివాళులు అర్పించిన చంద్రబాబు.

Samayam Telugu 14 Nov 2019, 10:31 am
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక దీక్ష ప్రారంభమయ్యింది. విజయవాడలోని అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ దగ్గర వేదికపై దీక్ష చేపట్టారు. బాబు ముందుగా ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల ఫోటోలకు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు భవన నిర్మాణ కార్మికులతో కలిసి వేదికపై దీక్షకు కూర్చున్నారు. టీడీపీ అధినేత దీక్ష ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటూ దీక్ష కొనసాగనుంది.

చంద్రబాబు దీక్షకు జనసేన, ఆప్‌తో పాటూ మరికొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక బీజేపీ ప్రతిపక్షాలు ఎలాంటి పోరాటాలు చేసినా తమ సంఘీభావం ఉంటుందని చెప్పింది. ఈ దీక్షకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. భవన నిర్మాణ కార్మిక సంఘాలు కూడా ధర్నా చౌక్‌కు తరలి వచ్చారు. అలాగే విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ కూడా చేపట్టారు. నేతలు, కార్యకర్తలు ర్యాలీగా ధర్నా చౌక్‌కు చేరుకున్నారు.
ఇసుక కొరతతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించి.. పార్టీ తరపున ఆర్థికసాయం అందించారు. ఇంత జరుగుతున్నా జగన్ సర్కార్ స్పందించడం లేదంటూ చంద్రబాబు దీక్ష చేపట్టారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి.. భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.