యాప్నగరం

Amaravati పర్యటనలో చంద్రబాబు భావోద్వేగం

Chandrababu Naidu Amaravati Tour| అమరావతిలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లిన టీడీపీ అధినేత.. భావోద్వేగంతో మోకాళ్లపై కూర్చోని సాష్టాంగ నమస్కారం.

Samayam Telugu 28 Nov 2019, 1:22 pm
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం చంద్రబాబు అమరావతి పర్యటనకు బయల్దేరారు. ఉండవల్లి నివాసం నుంచి వెళ్లి ముందు ప్రజా వేదిక కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బస్సులో బయల్దేరి ఉద్దండరాయుని పాలెం చేరుకున్నారు. అక్కడ బొడ్రాయికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం బస్సులో బయల్దేరి అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లారు.
Samayam Telugu cbn amaravati


Read Also: అమరావతిలో బాబు పర్యటన.. హైవోల్టేజ్ నిరసనలు.. ఈస్థాయిలో వ్యతిరేకత ఎందుకు?

శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి పరిశీలించారు. అక్కడ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. బాబు మోకాళ్లపై కూర్చోని రాజధాని నిర్మాణానికి పునాది వేసిన స్థలం వద్ద మోకరిల్లారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన అమరావతి శంకుస్థాపన శిలాఫలకాన్ని పరిశీలించి.. అమరావతి మ్యాప్‌, నమూనాను నేతలతో కలిసి పరిశీలించారు.

Also Read: అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.. బాబు కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి

ఉద్ధండరాయుడి పాలెం నుంచి వెళ్లి భవనాల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు ఎంత వరకు వచ్చాయి ఆరా తీస్తారు. అనంతరం రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి.. అక్కడ స్థానికులను కలుస్తారు. రైతులు, స్థానికుల సమస్యల్ని కూడా అడిగి తెలుసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.