యాప్నగరం

వాటి జోలికెళ్లొద్దని చెప్పినా వినలేదు.. అందుకే ఇలా.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

‘పవర్’ పాలిటిక్స్ ముదురుతున్నాయి. విద్యుత్ కోతలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎవరు చెప్పినా వినని సీఎం జగన్ మొండితనం వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 30 Sep 2019, 10:02 pm
ఏపీలో విద్యుత్ కోతలపై రాజకీయ దుమారం రేగుతోంది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ నుంచి విద్యుత్ కోతల దిశగా తీసుకెళ్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడుతున్నారు. ఇది రివర్స్ డెవలప్‌మెంట్ ప్రభుత్వమని, అందుకే నిరంతర విద్యుత్ సరఫరా నుంచి కరెంట్ కోతలు విధించే స్థాయికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తమ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్ అందుబాటులోకి తెస్తే దానిని కూడా రివర్స్ చేశారన్నారు.
Samayam Telugu YS Jagan Review Meeting_2_0


Also Read:
కావాలి ఇసుక.. రావాలి కరెంట్.. జగన్ సర్కార్‌పై లోకేష్ సెటైర్లు

రైతులకు 9 గంటల విద్యుత్ అని గొప్పలు చెప్పారని, ఇప్పుడు సగం కోసేశారని చంద్రబాబు విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిందని, అందుకే రాష్ట్రంలో అంధకారం నెలకొందన్నారు. థర్మల్ విద్యుత్‌పై ఆధారపడడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయని, పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుందన్నారు.

Read Also: 2014లోనే జగన్ సీఎం అవ్వాల్సింది! సుజనా ఆసక్తికర వ్యాఖ్యలు

అందుకే తెలుగుదేశం ప్రభుత్వం పవన, సౌర విద్యుత్ దిశగా అడుగులేసిందని చంద్రబాబు అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలను ప్రోత్సహించామన్నారు. విద్యుత్‌పై ముఖ్యమంత్రి జగన్‌కు అవగాహనలేదని, ఇతరులు చెబితే వినడం లేదన్నారు. ఆయన మొండితనం వల్లే సామాన్య ప్రజలకు, రైతులకు కష్టాలు దాపురించాయని, జగమొండితనం జనానికి శాపంగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.