యాప్నగరం

Godavari Boat: ధర్మాడి సత్యంకు చంద్రబాబు లేఖ

Darmadi Satyam| కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంకు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. లేఖలో ఏమని రాశారంటే..

Samayam Telugu 23 Oct 2019, 10:50 pm
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటును ధర్మాడి సత్యం టీమ్ ఒడ్డుకు చేర్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగి.. చివరికి విజయం సాధించింది. దీంతో ధర్మాడి సత్యం టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మాడి సత్యంకు ఓ లేఖ రాశారు. బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న సత్యం తపన, మునిగిన పడవను బయటకు తియ్యాలన్న పట్టుదల ప్రశంసనీయమని పొగడ్తలు కురిపించారు.
Samayam Telugu cbn


Read Also: గోదావరి బోటు విషాదం: హీరోగా మారిన ధర్మాడి సత్యం.. నేపధ్యం ఇదే

చంద్రబాబు తన లేఖలో.. గౌ|| ధర్మాడి సత్యం గారికి..నమస్కారములు..
‘బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న మీ తపన, మునిగిన పడవను బయటకు తియ్యాలన్న మీ పట్టుదల ప్రశంసనీయం. గోదావరిలో మునిగిన రాయిల్‌ వశిష్ట పడవను వెలికితీసేందుకు మీరు చూపిన తెగువ, చొరవ, పడిన శ్రమను అభినందిస్తున్నాను. పడవ వెలికితీత కోసం మీరు చూపిన శ్రద్ధలో ఒక్క శాతం అయినా ప్రభుత్వం పెట్టి ఉంటే, ఈ దురవస్ధ బాధిత కుటుంబాలకు వాటిల్లేది కాదు. ఇన్ని ప్రాణాలు గోదాట్లో కలిసిపోయేవేకాదు.

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చలూరు పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. పడవ వెలికితీతపై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టపోయినప్పటికీ మీరు అధికారుల వెంటపడి మరీ పడవను బయటకు తీస్తానని ముందుకొచ్చిన విషయం పత్రికల్లో చూశాను. మీ పట్టుదల సాయం చేయాలన్న తపన అభినందనీయం. బాధ్యతాయుతమైన మీ బృంద స్పూర్తి అందరిలో నెలకొనాలని ఆకాంక్షిస్తున్నాను. తమ వారిని కడసారి కూడా చూడలేమోనని కన్నీళ్లతో క్రుంగిపోయిన ఆప్తులకు మృతదేహాలను వెలికితీసి ఊరట కల్గించారు. తమ వారికి అంత్యక్రియలు నిర్వహించి వారి ఆత్మకు శాంతి కల్గించేందుకు మీరు, మీ బృందం దోహద పడ్డారు.

ఎంతో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు కచ్చలూరు పడవ ప్రమాదాన్ని, బాధితుల కన్నీళ్లను నిర్లక్ష్యం చేశారు. విపత్తులలో బాధితులను వదిలేసి దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారు. కానీ మీరు కుటుంబాలను వదిలి, అన్న పానీయాలు మాని జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు, వారి ఆప్తుల భౌతిక కాయాలను వారికి అప్పగించడం కోసం పడిన తపనను తెలుగుదేశం పార్టీ మనస్పూర్తిగా అభినందిస్తోంది’అన్నారు చంద్రబాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.