యాప్నగరం

చంద్రబాబు పాదయాత్ర.. రోడ్డుపై బైఠాయింపు

మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడికి నిరసనగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టారు.

Samayam Telugu 11 Mar 2020, 8:25 pm
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరాపై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. దాడిలో గాయపడిన నాయకులతో పాటు దెబ్బతిన్న వాహనాలతో ఆయన ర్యాలీగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
Samayam Telugu chandrababu


Also Read: ‘పల్నాడుకు 10 కార్లలో గూండాలను పంపిన చంద్రబాబు’

అయితే చంద్రబాబు సహా నేతలెవరూ లోపలికి ప్రవేశించకుండా పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో చంద్రబాబు సహా నేతలంతా బైఠాయించి నిరసన తెలిపారు. బైఠాయించిన చంద్రబాబు వద్దకు శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని కోరారు.

మాచర్లలో దాడి వివరాలను చంద్రబాబు ఆయనకు వివరించారు. పక్కనే ఉన్న బుద్దా వెంకన్న, బొండా ఉమా తమకు తగిలిన గాయాలను డీజీ రవిశంకర్‌కు చూపించారు. అనంతరం దెబ్బతిన్న వాహనాల దగ్గరకు తీసుకెళ్లి దాడి జరిగిన తీరును చంద్రబాబు సహా నేతలు డీజీకి వివరించారు. చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.

Also Read: ‘ఏపీలో బిహార్ కంటే దారుణ పరిస్థితులు.. దాడి చేసింది వైసీపీ రౌడీలే’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.