యాప్నగరం

నల్లచొక్కాతో అసెంబ్లీకి చంద్రబాబు.. విజయసాయిరెడ్డి సెటైర్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల అరెస్టులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు.

Samayam Telugu 16 Jun 2020, 11:46 am
ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో సహా పార్టీనేతలంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. చంద్రబాబు నల్లచొక్కా ధరించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు నల్ల షర్టు వేసుకున్న ఫోటోను షేర్ చేసి ఆయనపై విమర్శలు చేశారు.
Samayam Telugu చంద్రబాబు నాయుడు


'నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్‌సెన్స్!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏడాది కాలంగా ఏపీలో ప్రభుత్వ తీరుకి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని ఈ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. . సొంత అజెండాను అమలు చేసుకునేందుకే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు టీడీపీ నేతలు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని నేతలు తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.
అసెంబ్లీ ప్రారంభం అవ్వకముందే అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. సభలో మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా సమస్యల పరిష్కారం కోసం తమవంతుపోరాటం కొనసాగుతుందన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్బంగా అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. పార్టీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ సభ్యుల వాకౌట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.