తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరన్న సంగతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హితవుపలికారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు కూడా అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రబాబు నివాళులు అర్పించారు.
అంతకముందు చంద్రబాబు భారీ వాహన ర్యాలీతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి అని అన్నారు.
ఒంగోలులో జరిగిన అభివృద్ధి దామచర్ల జనార్దన్ కృషేనని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి అంతా గత టీడీపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. ఇక, జిల్లాకు సంబంధించిన సమస్యలను శనివారం సాయంత్రం జరిగే మహానాడు బహిరంగ సభలో మాట్లాడుతానని వెల్లడించారు. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందన్నారు. తమకు బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేవాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. సాయంత్రం బహిరంగ సభకు ఎంత మంది వస్తారో చూడండని చంద్రబాబు సవాల్ విసిరారు.
అంతకముందు చంద్రబాబు భారీ వాహన ర్యాలీతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి అని అన్నారు.
ఒంగోలులో జరిగిన అభివృద్ధి దామచర్ల జనార్దన్ కృషేనని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి అంతా గత టీడీపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. ఇక, జిల్లాకు సంబంధించిన సమస్యలను శనివారం సాయంత్రం జరిగే మహానాడు బహిరంగ సభలో మాట్లాడుతానని వెల్లడించారు. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందన్నారు. తమకు బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేవాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. సాయంత్రం బహిరంగ సభకు ఎంత మంది వస్తారో చూడండని చంద్రబాబు సవాల్ విసిరారు.