యాప్నగరం

నా వల్లే దేశంలో అందరి దగ్గరా సెల్‌ఫోన్లు: చంద్రబాబు నాయుడు

Nara Chandrababu Naidu: సెల్ ఫోన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్లే అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయన్నారు. ఇప్పుడు మగవాళ్లకు భార్య లేకున్నా, ఆడవాళ్లకు భర్త లేకున్నా ఫర్వాలేదు. కానీ, సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేరు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మీ మీడియాలో వేయకున్నా, మాకు సోషల్ మీడియా ఉందంటూ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అన్నారు. ఏపీకి కియా ఎవరు తెచ్చారని ప్రశ్నించారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 28 May 2022, 8:19 pm
టీడీపీ మహానాడు ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్లే దేశంలో అందరి దగ్గరా సెల్‌ఫోన్లు ఉన్నాయని ఆయన అన్నారు. మీడియా సంస్థలన్నీ జగన్ ప్రభుత్వానికి తొత్తుల్లా మారయని ఆరోపించిన చంద్రబాబు.. మీడియాలో మేం చెప్పేది వేయకున్నా.. మాకు సోషల్ మీడియా ఉందన్నారు. ‘సెల్ ఫోన్ ఎలా వచ్చిందో యువత గుర్తు పెట్టుకోవాలి. మీకు నేను ఇచ్చిన ఆయుధం అది. ఒకప్పుడు సెల్‌ఫోన్లు లేనప్పుడు నేనే సంస్కరణలు తీసుకొచ్చి, ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి డీ-రెగ్యులేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు మగాళ్లకు భార్య లేకున్నా ఫర్వాలేదు.. ఆడవాళ్లకు భర్త లేకున్నా ఫర్వాలేదు. కానీ, సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేరు’ అంటూ చంద్రబాబు చమత్కరించారు.
Samayam Telugu చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)
Chandrababu Naidu speech in TDP Mahanadu


‘ఇప్పుడు మీరు సెల్‌ఫోన్‌కు పదును పెట్టాలి. జగన్ తప్పుడు కేసులు పెడతాడని మొన్నటి వరకూ భయపడ్డారు. కానీ, మీ సమస్యలను నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో పెట్టండి. ఎవరి మీదైనా కేసులు పెడితే నేను ముందుండి కాపాడుకుంటా. అసవరమైతే ఓ ఉద్యమాన్ని నడిపిస్తాను. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

‘నేను ఐటీ ఉద్యోగం.. పోలీసు ఆఫీసర్ ఉద్యోగం.. టీచర్ ఉద్యోగం ఇస్తే.. జగన్ వాలంటరీ జాబ్ ఇచ్చాడు’ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఏపీకి కియా సంస్థను ఎవరు తెచ్చారు..? హైదరాబాద్ ఎవరు డెవలప్‌ చేశారు..?’ అని ఆయన ప్రశ్నించారు. పాచి పనులకు కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

‘జగన్ దావోస్‌కు వెళ్లి ఎక్కడైనా మాట్లాడాడా..? నేను గతంలోనే గ్రీన్ కో, అదానీతో మాట్లాడాను. ఈ ముఖ్యమంత్రికి విశ్వసనీయత లేదు. జగన్ ప్రవర్తన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టమని లూలూ గ్రూపు వెళ్లిపోయింది’ అని చంద్రబాబు ఆరోపించారు.

‘జగన్ వల్ల నిరుద్యోగులే కాదు చదువుకునే పిల్లలు కూడా బాగుపడలేదు. ఇంట్లో ఎందరు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి మాట తప్పారు. 300 యూనిట్ల కరెంట్ వాడితే అమ్మ ఒడి కట్ చేస్తున్నారు. ఉద్యోగులు పోరాడి భయపడిపోయారు. కానీ మీరేం భయపడకండి. మీ తరఫున నేను పోరడతాను. మేం అధికారంలోకి వచ్చాక మీడియాకు న్యాయం చేస్తాను. కరోనా వల్ల మరణించిన కుటుంబాలకు న్యాయం చేస్తాను. కరోనా కంటే ఎక్కువగా జగన్ వల్ల అందరికీ నష్టం వాటిల్లింది. కరోనాను జగన్ సరిగా డీల్ చేయలేకపోయారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్‌తో కరోనా తగ్గుందన్నారు. కానీ నేను ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ వాళ్లు్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేశారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. టీడీపీ పోరాడితే అరెస్ట్ చేసి పదవి నుంచి సస్పెండ్ చేశారు. మరి బాబాయిని కూడా చంపి గొడ్డలి పోటును కూడా గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా..? ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ మేం భయపడం. మీ బాంబులకు ఎవరూ భయపడరు. జగన్‌కు ధైర్యం ఉంటే.. డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చాడు. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పాడు. వాళ్లెవరూ భారతీ రెడ్డి మేనమామ, ఆయన కుమారుడు. జగన్‌కు దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Also Read:

TDPకి కేసీఆర్ స్నేహ హస్తం? కొత్త ఈక్వేషన్లు!

రాముడు ఉన్నప్పుడు రాక్షసుడు కూడా ఉంటాడు.. లోకేశ్ సంచలనం
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.